ప్రపంచ వ్యాప్తంగా కరోనా చేస్తున్న కరాళ నృత్యానికి త్వరలో ముగింపు పలకనున్నాయి కొన్ని దేశాలు.ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ తయారిలో ముందడుగు వేసింది.
తమ దేశానికి ఆగస్టు లో కరోనా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పిన రష్యా ప్రపంచానికి సెప్టెంబర్ లో అందిస్తామని ప్రకటించింది.ఈ క్రమంలోనే కరోనా వ్యాధి పై పలురకాలుగా పరిశోధనలు చేస్తూ మెరుగైన ఫలితాలు సాధించడంలో ముందువరుసలో నిలిచుంది.
దాంతో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లండన్ కి చెందిన భారతీయ కుబేరుడు బాగా వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ భారీ విరాళం అందించారు.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కరోనా ట్రయిల్ వ్యాక్సిన్ చేస్తోంది.
ఇందులో ఉత్తమమైన ఫలితాలు సాధిస్తోంది.దాంతో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలంటే భారీ మొత్తంలో డబ్బు అవసరమవుతుంది.
అయితే ప్రభుత్వంతో పాటు లండన్ లోని అనేక ప్రవైటు వ్యక్తులు కూడా ఈ యూనివర్సిటీకి విరాళాలు అందిస్తూనే పెట్టుబడులు పెడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే బ్రిటన్ లో బాగా వ్యాపారం చేస్తున్న లక్ష్మీ మిట్టల్ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి తనవంతు సాయం అందించాలని భావించారు…
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యాక్సినాలజీ డిపార్ట్మెంట్ కి 3.5 మిలియన్ డాలర్ల విరాళాన్ని అందించారు.ప్రపంచం మొత్తం కరోనతో అల్లాడిపోతోందని ఈ క్రమంలో ఎంతో మంది వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్ర కృషి చేస్తున్నారని ఆక్స్ ఫర్డ్ మాత్రం కరోనా వ్యాక్సిన్ ఫలితాలలో సక్సస్ అవుతున్న కారణంగా వారిని మరింతగా ప్రోశ్చహించే విధంగా నేను విరాళాన్ని అందిస్తానని తెలిపారు.
లక్ష్మి మిట్టర్ ఇచ్చిన ఈ విరాళం మా యూనివర్సిటీకి ఎంతగానో ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపుతూ కృతజ్ఞతలు తెలిపింది.