సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న అన్నాత్తే సినిమాల్లో నటిస్తున్నాడు.ఇందులో నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయడానికి సిద్ధంగా ఉండగా.ప్రస్తుతం ఈ పరిస్థితిలో కూడా షూటింగును వాయిదా వేయడం లేదు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగగా దాదాపు 35 రోజులు షూటింగ్ పూర్తి చేశారు.ఇక షూటింగ్ పూర్తి కాగానే రజినీకాంత్ ప్రియమిత్రుడు మోహన్ బాబు ఇంటికి ఆహ్వానించగా.
రజినీకాంత్ మోహన్ బాబు ఇంటికి వెళ్ళాడు.ఇక ఆ సందర్భంలో తన కుటుంబ సభ్యులతో రజినీకాంత్ కాస్త సమయాన్ని గడపగా.
తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగాడు రజినీకాంత్.
అంతేకాకుండా మోహన్ బాబు కూతురు సినీనటి మంచు లక్ష్మి కూడా రజినీకాంత్ తో ఫోటో దిగగా.
ఆ ఫోటో తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది మంచు లక్ష్మి.ఇక ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారగా.అక్కడ కాస్త సమయాన్ని గడిపి తిరిగి చెన్నైకి వెళ్ళాడట రజినీకాంత్.ఇక ఈ ఫోటో షేర్ చేసిన గంట వ్యవధిలోనే దాదాపు 14 వేల లైకులు వచ్చాయి.
ఇక ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సినీ బృందం ప్రకటించింది.ఇక ఈ సినిమా రజినీకాంత్ కు 168 సినిమాగా తెరకెక్కనుంది.ఈ సినిమా ప్రస్తుతం షూటింగును దాదాపు పూర్తి చేసుకోగా.
కొన్ని రోజులు కిందట ఈ సినిమా మధ్యలో రజనీకాంత్ అనారోగ్యం సమస్య ఎదుర్కోవడం వల్ల ఆగిపోయింది.