పెళ్లిల్లు అనేవి ఈమద్య కాలంలో తమ స్థాయిని నిరూపించుకునేవిగా మారిపోయాయి.డబ్బు భారీగా ఉన్న వారు మూడు రోజులు కోట్ల ఖర్చు చేసి చేస్తున్నారు.
మద్య తరగతి కుటుంబం వారు కూడా లక్షల ఖర్చుతో పెళ్లిలు చేస్తున్నారు.కొందరు బడాయి కోసం అప్పు తెచ్చి మరీ గొప్పగా పెళ్లి చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమయంలో పెళ్లికి వచ్చిన అతిథులు కూడా అదే విధంగా తమ బడాయిని చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నువ్వా నేను అన్నట్లుగా పోటీగా ఒకరిని మించి ఒకరు పెళ్లిలో బహుమానాలు ఇస్తున్నారు.
పెళ్లిలో తమదే అతి ఖరీదైన బహుమతి అవ్వాలని కొందరు, అందరికంటే చాలా విభిన్నంగా ఉండాలని మరి కొందరు రకరకాలుగా కొత్త పెళ్లి దంపతులకు బహుమానాలు ఇస్తూ ఉంటారు.తాజాగా హైదరాబాద్లో జరిగిన ఒక పెళ్లి తంతు అరుదైన సంఘటన జరిగింది.
పెళ్లిలో ఒక అథితి చేసిన పని కాస్త ఆ పెళ్లి గురించి అంతా మాట్లాడుకునేలా చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…
సరూర్ నగర్ మేఘన గౌడ మరియు సుశాంత్ల వివాహం నాగోల్లోని శభం కన్వెన్షన్లో జరిగింది.భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పెళ్లి నిర్వహించారు.పెళ్లి ముగిసిన తర్వాత గెస్ట్లు ఒక్కరొక్కరుగా వచ్చి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తున్నారు.
ఆ సమయంలోనే ఒక వ్యక్తి బుట్టతో స్టేజ్ పైకి ఎక్కాడు.
పెద్ద సైజ్ బుట్ట నిండుగా నోట్లు ఉన్నాయి.ఆ నోట్లను రెండు చేతులతో పట్టుకుని వధువు, వరుడిపై కుమ్మరించాడు.ఆయన డబ్బులను కుమ్మరిస్తుంటే ఇతర బందవులు నోరు వెళ్లబెట్టారు.
అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయారు.సోషల్ మీడియాలో ఆయన నోట్ల తలంబ్రాలు వేసిన విషయాన్ని కొందరు పోస్ట్ చేశారు.
దాంతో అది కాస్త వైరల్ అయ్యింది.హైదరాబాద్లో జరిగిన ఈ పెళ్లి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.