పూరీ జగన్నాథ్ రథయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఓడిస్సాలో జరిగే పూరీ జగన్నాథ్ రథయాత్రకి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
ఈ రథయాత్ర సమాయంలో లక్షల సంఖ్యలో భక్తులు పూరీకి చేరుకుంటారు.జగన్నాథుడు దర్శనం చేసుకొని రథయాత్రలో పాల్గొంటారు.
ఇక రథయాత్ర సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా వేల సంఖ్యలో పోలీసులు కాపలా ఉంటారు.అయితే లక్షల సంఖ్యలో జనం మధ్యలోంచి పిట్ట మనిషి కూడా ముందుకి కదలలేడు.
అయితే తాజాగా ఈ రథయాత్రలో ఓ అద్బుతమైన సంఘటన జరిగింది.
లక్షల మంది భక్తుల మధ్య జగన్నాథుడు ఊరేగుతుండగా అకస్మాత్తుగా అంబులెన్స్ సైరన్ వినిపించింది.
వెంటనే లక్షల మంది జనం అడ్డుతప్పుకోగా 1200 మంది వాలంటీర్లు కష్టపడి అంబులెన్స్కు దారి ఇవ్వడం కోసం మానవ హారంలా నిలబడ్డారు.దీంతో అంబులెన్స్ లక్షలాది భక్తుల మధ్య నుంచి పరుగులు పెట్టింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే లక్షల సంఖ్యలో భక్తులు అలా వెంటనే రియాక్ట్ అయ్యి అంబులెన్స్ కి దారి ఇవ్వడానికి అడ్డు తప్పుకోవడం, అది కూడా ఎలాంటి తోపులాటలు లేకుండా జరగడం ఇప్పుడు ఆ వీడియో కాస్తా సంచలనంగా మారింది.