బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 100కి పైగా చిత్రాలలో హీరోగా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు “చుంకీ పాండే” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా అప్పట్లో చుంకీ పాండే ప్రముఖ హీరోలయిన అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, గోవిందా, తదితర స్టార్ హీరోలకి తన చిత్రాలతో గట్టి పోటీ ఇచ్చాడు.
కాగా ప్రస్తుతం వయసు మీద పడటంతో నటనకు స్వస్తి పలికి విశ్రాంతి తీసుకుంటున్నాడు.అయితే ఇటీవలే చుంకీ పాండే మొదటి కూతురు “అనన్య పాండే” కూడా హీరోయిన్ గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
అయితే చుంకీ పాండే రెండో కూతురు రైసా పాండే ప్రస్తుతం చదువుల్లో బాగానే రాణిస్తోంది.అలాగే స్పోర్ట్స్ లో కూడా తన ప్రతిభను నిరూపించుకుంటోంది.ఈ క్రమంలో ఇటీవలే రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 10km పరుగు పందెంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.దీంతో రైసా పాండే కుటుంబ సభ్యులు మరియు ఇతర స్నేహితులు అభినందించారు.
కాగా ఇటీవలే అనన్య పాండే తన సోదరితో సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ అనన్య పాండే సోదరి చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ అమ్మడు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే అనన్య పాండే కి సొంత ఇంటి నుంచే పోటీ తప్పదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనన్య పాండే తెలుగులో ప్రముఖ దర్శకుడు “పూరి జగన్నాథ్” దర్శకత్వం వహిస్తున్న “లైగర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ రౌడీ “విజయ్ దేవరకొండ” నటిస్తుండగా ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.