‘బాహుబలి’ ఏ చిన్న వార్త అయినా కూడా బ్యానర్ న్యూస్గా ప్రచారం జరుగుతోంది.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఆడియోను ఈనెల 13న తిరుపతిలో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
ఆడియో విడుదల కాకుండానే ఈ సినిమాలోని ఒక పాట లీక్ అయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.లీక్ పాట ఏమో కాని, ఈ సినిమా ఆడియో హక్కులను దక్కించుకున్న లహరి మ్యూజిక్ సంస్థ ఒక పాటను అధికారికంగా విడుదల చేసింది.
‘ఎవ్వడంటా ఎవ్వడంటా నిన్నుఎత్తుకుంది.ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది.
’ అంటూ సాగే ‘బాహుబలి’ పాటకు శ్రోతల నుండి మంచి స్పందన వస్తోంది.మూడు నిమిషాల 12 సెకన్లు ఉన్న ఈ పాట యూట్యూబ్లో తెగ హల్ చల్ చేస్తోంది.
కీరవాణి స్వరపర్చి స్వయంగా పాడిన ఈ పాట ఇప్పటికే అందరి నోళ్లలో నానుతోంది.ఇక ఈపాటలోనే సినిమా కథ అర్థం అవుతోంది.
శివుడు చిన్న పిల్లాడుగా ఉన్నప్పటి నుండి పెద్ద అయినప్పటి వరకు ఈ సాంగ్ ఉండే అవకాశం ఉంది.అంటే శివుడు ఈ పాట వస్తున్నప్పుడే పెద్దవుతాడని, యుద్ద విధ్యలు అభ్యసిస్తాడని తెలుస్తోంది.
ఇక మిగిలిన పాటలు ఎలా ఉండబోతున్నాయో మరో రెండు రోజులు ఆగితే తేలిపోతుంది.ఈ సినిమాను జులై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాహుబలి ఫస్ట్ సాంగ్ కోసం చేయండి
.