తెలంగాణాలో జరగబోతున్న ఎన్నికలపై అందరి దృష్టి పడింది.హోరాహోరీగా జరగబోతున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరికి దక్కుతుంది అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
ఇప్పటికే అనేక అనేక సర్వేలు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి… అనే విషయంపై లెక్కతేల్చుతూ… తమ సర్వే రిపోర్ట్స్ బయటపెట్టాయి.ఇక పార్టీలు తమ ఎన్నికల ప్రచారంతో విజయం మాది అంటే మాది అంటూ … ఎవరికి వారు ధీమాగా ప్రచారంలో మునిగి తేలుతున్నారు.ఈ తెలంగాణ ఎన్నికల ఫీవర్ సోషల్ మీడియా లో కూడా బాగా ఎక్కువ కనిపిస్తోంది.
సాధారణ మీడియా కు పోటా పోటీగా ఇందులో పార్టీల ప్రచారం … వివిధ పార్టీల పోల్స్ తో … ఈ సోషల్ మీడియా హోరెత్తుతోంది.
అంతేకాదు … ఇప్పుడు లేటెస్ట్ సర్వే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.ఈ సర్వే లగడపాటి రాజగోపాల్ చేసిన సర్యేగా ప్రచారం చేస్తున్నప్పటికీ… దీనికి సంబంధించి ఆయన మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.కానీ మొత్తంగా చూస్తే ఈ సర్వే లో తెలంగాణాలో టీఆర్ఎస్ మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయం అంటూ లెక్కతేల్చారు.అయితే… ఈ సర్వేకు ఇప్పటికే వేలల్లో లైకులు, కామెంట్ లు రావడం చూస్తే ఈ సర్వే రిజల్ట్ నిజమేనా అనే సందేహం కలుగుతోంది.
అయితే… కేసీఆర్ కు అధికారం దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో … తమ వైరాన్ని కూడా పక్కనపెట్టి టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడినప్పటికి ఆ పార్టీలకు ఫలితం దక్కదని ఈ సర్వే తేల్చేసింది.
తెలంగాణలోని 119 స్థానాల్లో దాదాపుగా 80 నుండి 87 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పథకాలే ఆయన్ను గెలిపిస్తాయని ఆ సర్యే లో తేలడం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 20-23 స్థానాలు దక్కే అవకాశం ఉందని, ఆ పార్టీతో మూడున్నర దశాబ్దాల శతృత్వాన్ని పక్కనపెట్టి చేయి చేయి కలిపిన టీడీపీకి కేవలం 3-4 నియోజకవర్గాలు దక్కనున్నాయట.ఇక, కూటమిలోని మరో పార్టీ అయిన టీజేఎస్కి 02, సీపీఐకి 01, స్థానాలు దక్కుతాయని చెబుతుండగా ఎమ్ఐఎమ్కి 7 నియోజకవర్గాలలో పట్టు ప్రదర్శిస్తుందని చెబుతున్నారు.బీజేపీ 3-4 స్థానాలు దక్కుతాయని తేలిందట.
మొత్తంగా చూస్తే… తెలంగాణాలో కారు జోరు మీద ఉన్నట్టు సర్వేలో తేలింది.అయితే మరి కొద్ది రోజులు ఆగితే… ఎవరు అధికారం చేపడతారో.
ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో చూడాలి.