ఈ నెల 23 న ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.
ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటూ పలు సర్వేలు జరుగుతున్నాయి.అయితే ‘అన్నీ సర్వేలలో లగడపాటి సర్వే వేరయా’ అంటూ మన ఆంధ్రా ఆక్టోపస్ తన సర్వే ఫలితాలను వెల్లడించిన విషయం విదితమే.
అయితే తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే బెడిసికొట్టడం తో ఇప్పడు ఆయన చేసిన తాజా సర్వే పై అందరూ ఛలోక్తులు విసురుతున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆంధ్రా ఆక్టోపస్ ఈ సారి నా సర్వే గనుక తప్పితే మాత్రం ఇక మళ్లీ సర్వే చేసి చెప్పను అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.గత తెలంగాణా ఎన్నికల సమయంలో నా సర్వే తప్పడం తో నా సర్వే పై విశ్వసనీయత పోయింది.కానీ ఈ నెల 23 తరువాత ప్రజల్లో నా పై విశ్వసనీయత మరింత పెరుగుతుంది అని లగడపాటి వ్యాఖ్యానించారు.
నా సర్వే ను నమ్మాలని కానీ కత్తి పెట్టి నా సర్వే వినండి అని కానీ నేను చెప్పడం లేదు.నమ్మేవాళ్ళు నమ్ముతారు లేదంటే నమ్మరు అంటూ లగడపాటి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు