ఏపీ రాజకీయాలలో మాజీ పార్లమెంట్ సభ్యులుగా వుంటూనే తనదైన శైలితో ఆంద్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజకోపాల్ గత ఎన్నికల నుంచి రాజకీయాలకి దూరంగా వున్నారు.తాను రాజకీయాలలోకి వచ్చే అవకాశం లేదని చాలా సందర్భాలలో చెప్పారు.
అయితే ఊహించని విధంగా మరల ఎన్నికల ముందు లగడపాటి రాజకీయాలలోకి రీఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.టీడీపీ పార్టీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి పని చేయడానికి లగడపాటి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సారి టీడీపీ తరుపున లగడపాటిని నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే టీడీపీ సానుభూతిపరుడుగా ముద్ర వేసుకున్న రాజగోపాల్ ఇకపై టీడీపీ పార్టీ తరుపున బరిలో నిలబడటం ఆసక్తికరంగా మారింది.
అయితే ఇప్పటికే ఏపీలో టీడీపీ మీద ప్రజలలో వ్యతిరేకత పెరిగిన నేపధ్యంలో రాజగోపాల్ రీ ఎంట్రీ అతనికి నిరాశ మిగిల్చే అవకాశం వుందని అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతుంది.ఇలాంటి పరిస్థితిలో లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.