బాబు తో ఏబీఎన్ రాధాకృష్ణ, లగడపాటి భేటీ ..? ఎందుకో...?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఏబీఎన్ రాధాకృష్ణ – విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయినట్టు తెలుస్తోంది.ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 Lagadapati And Abn Radhakrishna Secret Talks With Chandrababu-TeluguStop.com

అసలు ఈ ముగ్గురు కలిసి ఏ విషయంపై చర్చించుకున్నారు.? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది.

.తెలంగాణ ఎన్నికల సమయంలో సర్వేల పేరుతో హడావుడి చేసి.కాంగ్రెస్,టిడిపిల కూటమి గెలవబోతోందని ప్రచారం చేసిన రాధా కృష్ణ , లగడపాటి ఇప్పుడు అత్యవసరంగా భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఎపిలో టీడీపీ బలహీన పడుతున్నదని,దానిని జనంలోకి మళ్లీ ఎలా తీసుకువెళ్లాలన్నదానిపై చర్చించుకున్నట్టు సమాచారం.

అంతే కాకుండా తెలంగాణాలో ఏ విధంగా అయితే… సర్వేల పేరుతో హడావుడి చేశారో ఆ విధంగానే ఏపీలో సర్వేల పేరుతో ప్రజలలో గందరగోళం సృష్టించడానికి వారు ముగ్గురు భేటీ అయ్యారంటూ… వైసీపీ ఆరోపణలు మొదలుపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube