ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఏబీఎన్ రాధాకృష్ణ – విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయినట్టు తెలుస్తోంది.ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలు ఈ ముగ్గురు కలిసి ఏ విషయంపై చర్చించుకున్నారు.? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది.
.తెలంగాణ ఎన్నికల సమయంలో సర్వేల పేరుతో హడావుడి చేసి.కాంగ్రెస్,టిడిపిల కూటమి గెలవబోతోందని ప్రచారం చేసిన రాధా కృష్ణ , లగడపాటి ఇప్పుడు అత్యవసరంగా భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఎపిలో టీడీపీ బలహీన పడుతున్నదని,దానిని జనంలోకి మళ్లీ ఎలా తీసుకువెళ్లాలన్నదానిపై చర్చించుకున్నట్టు సమాచారం.
అంతే కాకుండా తెలంగాణాలో ఏ విధంగా అయితే… సర్వేల పేరుతో హడావుడి చేశారో ఆ విధంగానే ఏపీలో సర్వేల పేరుతో ప్రజలలో గందరగోళం సృష్టించడానికి వారు ముగ్గురు భేటీ అయ్యారంటూ… వైసీపీ ఆరోపణలు మొదలుపెట్టింది.