మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో రవితేజ మరోసారి అదిరిపోయే సక్సెస్ కొడతాడని అందరూ అశిస్తున్నారు.
కాగా ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆనుకున్నారు.
అయితే ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, ఈ సినిమా కథ ఏమిటో మనకు క్లూ ఇచ్చారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాలో తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.అయితే ఆమె ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుందని అందరూ అనుకుంటున్నారు.
కానీ ఈ సినిమాలో ఆమె లేడీ విలన్ పాత్రలో కాకుండా హీరోయిన్గా నటిస్తోందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ రవితేజతో రొమాన్స్ కూడా చేయనుందని తెలుస్తోంది.
హీరోయిన్ శృతి హాసన్ తరువాత అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనుందట.ఇక ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, లాక్డౌన్ కారణంగా అది వాయిదా పడింది.