సినిమా పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు అలాగే తమ నటి లేదా నటుడు కావాలనే కోరికతో పాటూ లక్ష్యాన్ని సాధించే వ్యూహాలు కూడా ఎంతో ముఖ్యం… ఈ క్రమంలో కొందరు నటిగా అవకాశాలు దక్కించుకుని సెలబ్రిటీగా మారితే మరికొందరు మాత్రం వెండి తెరపై తమని తాము చూసుకోవాలనే కోరిక తీరకుండానే కాలం చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.
అయితే హీరోయిన్ కావాలని కలలు కన్న ఓ యువతి కరుడ గట్టిన నేరస్థురాలు గా మారిన కథ ఇది.
పూర్తి వివరాల్లోకి వెళితే మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగిన “అర్చన ముకుంద పాల్ శర్మ” గురించి తెలియని వారుండరు. అయితే ఈమె చాలా మందికి సాధారణ యువతిగా కంటే ఎక్కువగా లేడీ కిడ్నాపర్ గా బాగా తెలుసు.అయితే చిన్నప్పటి నుంచి బ్రతకడానికి చాలా కష్టాలు పడిన అర్చన ముకుంద పాల్ శర్మ వయసు వచ్చిన తర్వాత మాత్రం సినిమా రంగంలో రాణించాలని అనుకుంది.
కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె సినీ పరిశ్రమకు దగ్గర కాలేకపోయింది.దీంతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించక పోవడంతో పూర్తిగా మనస్తాపానికి గురైంది. అనంతరం స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి గుండా గ్యాంగ్ లో చేరింది.
ఇక అప్పటి నుండి ఈ అమ్మడి నేర చరిత్ర మొదలైంది.
అయితే అప్పట్లో అర్చన శర్మ మనుషులను అపహరించడంలో మంచి దిట్ట.దీంతో కొందరు రాజకీయ నాయకులు కూడా అర్చన ముకుంద పాల్ శర్మతో పనులు చేయించుకున్నారని అభియోగాలు ఇప్పటికి చాలానే ఉన్నాయి.
కాగా అర్చన శర్మ ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ కిడ్నాప్ చేయాల్సిన మనిషిని తన మనుషుల ద్వారా కిడ్నాప్ చేస్తుంది. అంతటి నెట్వర్క్ అర్చన ముకుంద పాల్ శర్మ మెయింటైన్ చేస్తోంది.
అలాంటి అర్చన ముకుంద పాల్ శర్మ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.