ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఈ ఎఫైర్స్ కారణంగా కట్టుకున్న భర్తని కూడా మహిళలు చంపడానికి వెనుకాడటం లేదు.
భర్తలని ప్రియుడితో కలిసి హత్య చేయించే ఆడవాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో భాగా పెరిగిపోయింది.తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం తప్పని చెప్పి మందలించే భర్త అడ్డుతొలిగించుకోవడానికి క్రురమైన ఆలోచనలు చేసి హత్య చేయడం చేస్తున్నారు.
ఇలాంటి కేసులలో వెంటనే పట్టుబడి కటకటాల పాలవుతున్న కూడా ఆడవాళ్ళలో మార్పు రావడం లేదు.వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మానడంలేదు.
మొగుళ్ళని హత్య చేయడం ఆపడం లేదు.అయితే మొగుళ్ళని ప్రియుడితో కలిసి హత్య చేయించిన కథనాలకి విరుద్ధంగా ఓ చోట తన పెళ్లికి అడ్డు వస్తున్న ప్రియుడిని ఓ యువతి సుపారీ ఇచ్చి హత్య చేయించింది.
ఇక సుపారీగా ఆ యువతి హత్య చేసిన వాడికి ఒక వన్ నైట్ స్టాండ్ ని ఆఫర్ చేసింది.ఇక అమ్మాయి పొందుకి కక్కుర్తి పడిన అతను ఆమె ప్రియుడిని కిరాతకంగా చంపేశాడు.
ఈ ఘటనమహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది.చందూ మహాపూర్ అనే వ్యక్తికి ఇప్పటికే వివాహం కాగా మరో అవివాహిత యువతితో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు.అవివాహితకి ఇటీవల మరొకరితో పెళ్లి నిశ్చయమైంది.ఈ పెళ్లిని ఇష్టపడని చందూ, పెళ్లి చేసుకోవద్దంటూ ఒత్తిడి తెస్తుండటంతో ఆ యువతి అతన్ని చంపించాలని నిర్ణయించుకుంది.
చందూకు దూరపు బంధువు అయిన భరత్ గుర్జార్ ను కలిసింది.చందూని చంపితే డబ్బుతో పాటు ఒక రాత్రి తనతో గడుపుతానని యువతి ఆఫర్ చేసింది.
దీంతో మరో ఆలోచన లేకుండా చందూను మద్యం సేవించడానికి పిలిచి, నిర్మానుష్య ప్రాంతంలో తల పగులగొట్టి హత్య చేశాడు.ఈ ఘటన 25వ తేదీన ఆపై మృతదేహాన్ని ఓ క్రషర్ మైన్ వద్ద పడేయగా, గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు చందూను తీసుకెళ్లింది గుర్జార్ అని నిర్దారణకు వచ్చారు.ఆ వెంటనే గుర్జార్ ను, అతనికి ఆఫర్ ఇచ్చిన యువతిని, ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు.
అయితే చంపిన వ్యక్తికి ఆఫర్ దక్కకుండానే ఆ యువతి జైల్లోకి పోయింది.