స్టార్ హీరోలకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.హీరోయిన్స్ కి కూడా అబ్బాయిల నుంచి ఫాలోయింగ్ ఉంటుంది.
సినిమాలలో వారు చేసే పాత్రలు, నిజజీవితంలో వారి వ్యక్తిత్వాన్ని చూసి చాలా మంది యువత సెలబ్రిటీలని రోల్ మోడల్ గా తీసుకుంటారు.కొందరైతే ఏకంగా వారితో ప్రేమలో పడిపోతారు.
అష్టాచెమ్మా సినిమాలో హీరోయిన్ స్వాతి మహేష్ బాబుకి వీరాభిమానిగా కనిపిస్తుంది.మహేష్ బాబు అనే పేరున్న వాడినే పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది.
అలాంటి అభిమానం ప్రేమ నిజ జీవితంలో చాలా మంది అమ్మాయిలకి ఉంటుంది.అయితే ఒక్కో అమ్మాయి ఒక్కో హీరో అంటే పడి చచ్చిపోతారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాగూ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనే విషయం తెలిసిందే.అయితే మాస్ హీరో ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ కి కూడా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తాజాగా ఓ లేడీ ఫ్యాన్ నుంచి ఆయనకి వచ్చిన లవ్ లెటర్ చూస్తే అర్ధమవుతుంది.
కాకినాడకు చెందిన సంధ్య అనే అమ్మాయి చెర్రీకి వీరాభిమాని.తన ప్రేమనంతా రంగరించి అక్షరాలుగా గుమ్మరించి ఓ లేఖ రాసింది.చెర్రీని ఏకంగా బావా అంటూ పిలవడం విశేషం.నా పేరు సంధ్య, మాది కాకినాడ.
నీకు నేను వీరాభిమానిని. నీ కళ్లు, నవ్వు, హెయిర్, లుక్స్, స్టైల్, యాటిట్యూడ్ ఇలా ఒక్కటేంటి నీలో ప్రతీది ఇష్టమే.
నువ్వు చాలా హ్యాండ్సమ్గా, క్యూట్గా ఓ రేంజ్లో ఉంటావు.ఇక నటన విషయానికొస్తే ఇరగదీస్తావు.
ఏ పాత్ర అయినా దాన్ని చింపి పారేస్తావు.నేను నీ సినిమాలు చూసుకుంటూనే పెరిగాను.
కేవలం నటన మాత్రమేనా, డ్యాన్సింగ్ కూడా ఇచ్చిపడేస్తావు.ఓవరాల్గా నన్ను పడగొట్టేశావు.
ఏదో ఒకరోజు, ఎప్పుడో ఒకసారి నిన్ను తప్పకుండా కలుస్తానన్న నమ్మకం నాకుంది.ఐ లవ్ యూ సో మచ్ రామ్ చరణ్ బావా అని రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది
.