అమెరికాలోని టెక్సాస్ లో పాడుబడిన ఇంట్లోనుంచీ మంటలు వస్తున్నాయని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి అది పాడుబడిన ఇల్లని తెలుసుకున్నారు.అయితే ఎందుకైనా మంచిదని మంటలు వస్తున్నా సరే లోపలి వెళ్లి చూడగా కాలిపోతున్న ఓ మహిళ శరీరం కనిపించింది.
ఓ పాడుబడిన ఇంట్లో మహిళ ఉండటం, చుట్టూ పక్కల వారికి ఆ కాలుతున్నప్పుడు అరుపులు కూడా వినిపించడం అంతా మిస్టరీగా మారింది.ఈ ఘటన టెక్సాస్లోని ఫోర్త్ ఎవెన్యూలో జరిగింది.
పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ ఇంటి గోడలు పగుళ్ళు తో ఉన్నాయని, అక్కడ వండుకుని తినడానికి కొన్ని సామాన్లు సరుకులు ఉన్నాయని.ఆమెతో ఒక్కతే ఇక్కడ ఉందని గ్రహించారు.
అయితే తమకి ఉన్న సమాచారం మేరకు ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదని, ఈ మహిళ కి ఎవరూ ఉండిఉండరు ఎక్కడ ఉండటానికి లేకపోవడంతోనే ఆమె ఇక్కడ ఉందని భావిస్తున్నారు.అయితే ప్రమాద వశాత్తు ఆమె చనిపోయిందా లేక కావాలని ఆమెని ఎవరైనా చంపి ఇంటికి నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.