కష్టపడి పని చేస్తుంటాం.దానికి తగ్గ ఫలితం కూడా అశిస్తాం.
కానీ మనం చేసిన పనికి డబ్బులు రాకపోతే చాలా కోపం వస్తుంది.ఎవరైనా ఇతరుల వద్ద పని చేసేది డబ్బుల కోసమే.
అయితే కొన్ని సార్లు మనం చేసిన పనికి డబ్బులు రాకపోయినా ఏమీ అనకుండా ఉండాల్సి వస్తుంది.కానీ డబ్బు చెల్లించే వారు ఎక్స్ ట్రాలు చేసినా, మనకు డబ్బు ఇవ్వకుండా వాళ్లు లగ్జరీగా బతికినా ఇంకా ఎక్కువ కోపం వస్తుంది.
అలాంటప్పుడు వారి మీద పడి దాడి చేయడమో, శాపనార్ధాలు పెట్టడమో చేస్తుంటారు చాలా మంది.కానీ తనచేత పని చేయించకొని డబ్బులు ఇవ్వని యజమానికి కారుకు నిప్పు పెట్టాడో కూలీ.
అదెక్కడ, అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్ రఖ్ ఠాణా పరిధిలోని జలాల్ పుర్ గ్రామానికి చెందిన రణ్ వీర్.
నొయిడా సెక్టార్-39లోని సదర్ పుర్ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్ ఇంట్లో టైల్స్ పని చేశాడు.ఇందుకు సంబంధించి రణ్ వీర్ కు ఆయుష్ రూ.68వవేలు చెల్లించాల్సి ఉంది.అయితే ఆ డబ్బులు కోసం ఇప్పటికే రణ్ వీర్ చాలా సార్లు యజమానిని అడిగాడు.
అయితే ఆయుష్ ఎంతకూ స్పందించకపోవడంతో రణ్ వీర్ విసిగిపోయాడు.మంగళవారం బైక్ పై సదర్ పుర్ కాలనీకి వెళ్లాడు.
ఆయుష్ ఇంటి ముందు పార్కు చేసి ఉన్న మెర్సిడెజ్ బెంద్ కారుపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడు.అనంతరం పారిపోయాడు.
అయితే ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు రణ్ వీర్ ను అరెస్ట్ చేశారు.