తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు రమణ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖని అందించారు.గురువారం ప్రగతి భవన్ లో సీం కే.సి.ఆర్ తో చర్చించిన రమణ పార్టీ మారడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.ఈ నేపథ్యంలో పార్టీ మారాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.రమణ టీడీపీ నుండి బయటకు వచ్చేశారు.టీ.
ఆర్.ఎస్ లో చేరాలని తాను నిర్ణయించుకున్నట్టు రమణ అధికారికంగా ప్రకటించారు.తెలంగాణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు.
30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎల్.రమణ కృతజ్ఞతలు తెలిపారు.కే.సి.ఆర్ తో మీటింగ్ అనంతరమే ఎల్.రమణ పార్టీ మారడంపై చర్చాంశనీయంగా మారింది.టీ.ఆర్.ఎస్ లో తగిన గుర్తింపు ఇస్తామని కే.సి.ఆర్ హామె ఇచ్చారని రమణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.టీ.ఆర్.ఎస్ అధికార కార్యాలయం తెలంగాణ భవన్ లో కే.సి.ఆర్ సమక్షంలో ఎల్.రమణ టీ.ఆర్.ఎస్ లో చేరనున్నారు.బీసీ నాయకుడు ఈటల రాజేందర్ పార్టీని వీడటంతో మరో బీసీ నేత అవసరం ఉందని భావించిన టీ.ఆర్.ఎస్ ఎల్.రమణని పార్టీలోకి ఆహ్వానించారు.