తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి మాములుగా లేదు.ఇప్పుడు టికెట్ దక్కని నాయకులంతా… కాంగ్రెస్ పార్టీకి శాపనార్ధాలు పెడుతున్నారు.
పందులు, రాబందులు చేరి టికెట్లు అమ్ముకున్నారని ఇలా భారీ భారీ డైలాగులు చెబుతూ పార్టీ పరువు బజారున పడేస్తున్నారు.ఇబ్రహీంపట్నం టికెట్ ఆశిస్తున్న డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వనస్థలిపురంలోని తన నివాసంలో ఇంబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమావేశైన ఆయన… తనకు ఇంకా టికెట్ ప్రకటించకడపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీలో సీట్లను అమ్ముకున్నారని ఆరోపించిన క్యామ మల్లేష్… దానికి సంబంధించిన ఆడియో రికార్డులు తన దగ్గర ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.టికెట్ దక్కకపోతే తాను రెబల్ గా పోటీ చేస్తాను అంటూ… అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసాడు.
తాజా వార్తలు