ఎన్నికలలో పోటీ చేయను...ఖుష్బూ.

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పర్వం మొదలైంది.ఇక ఈ ఎన్నికలలో తామే గెలుస్తామని ఓపక్క డీఎంకే మరోపక్క ఏ.డి.ఎమ్.కే కాన్ఫిడెంట్ గా చెబుతున్నాయి.ఇక సౌత్ లో పాగా వేయాలని భావిస్తున్న బిజేపికి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.

 Kushboo Condemns Rumors On Contesting Elections, Elections, Tamilnadu, Jayalalit-TeluguStop.com

ఇక తమిళనాడులో పవర్ ఫుల్ లేడిగా పేరున్న జయలలిత మరణానంతరం జరుగుతున్న తొలి ఎన్నికల ప్రక్రియ ఇది.ఇక ఈ ఎన్నికలలో అధికార పార్టీ ఏ.డి.ఎమ్.కే ఏ మేర రాణిస్తుందో చూడాలి.ఈసారి ఎన్నికలకు తాను ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకి వెళ్లడానికి కమల్ హాసన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అందుకోసం ఆయన మిగతా ప్రాంతీయ పార్టీల మాదిరిగా మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు.మరి ఇది కామన్ వెల్త్ మరియు ఆయన పార్టీకి ఏ మేర విజయాన్ని కట్టబెడుతుందో వేచి చూడాలి.

ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో హీరోయిన్ ఖుష్బూ కు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతుంది.మరి దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.

కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్‌ మరణంతో ఖాళీయైన ఆ స్థానం నుండి ఎన్నికలలో బరిలోకి దిగడానికి కాంగ్రెస్ అధికారి ప్రతినిధి ఖుష్బూ ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై పార్టీ కూడా సానుకూలంగానే ఉందని.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇక తాజాగా దీనిపై స్పందించిన ఖుష్బూ ప్రతిసారి ఎన్నికల ముందు ఇలాంటి వార్తలు రావడం సహజంగా మారిందని అలాగే ఎంపీ వసంత్‌ కుమార్‌ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆమె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube