ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు మరియు చట్టాలు తీసుకువచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేక పోతున్నాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి మరియు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ ని ఓ వ్యక్తి ఆమెపై దారుణంగా అత్యాచారం చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఇటీవలే తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
వివరాల్లోకి వెళితే గత కొద్ది కాలంగా కోల్కతా రాష్ట్రానికి చెందిన సంజయ్ శర్మ అనే వ్యక్తి తనకి ఫోన్ చేసి తనపై అత్యాచారం చేస్తానని బెదిరిస్తున్నాడని, అతడి పేరు, ఫోన్ నెంబర్లు కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ కోల్కత్త రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేసింది.అంతేగాక మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుత కాలంలో కొందరు సెలబ్రిటీల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని కాబట్టి నిందితుడిని కనుగొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నటి కుష్బూ 2017 వ సంవత్సరం లో టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అజ్ఞాత వాసి” అనే చిత్రంలో టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి తల్లిగా నటించింది.
ఆ తర్వాత ఇక మళ్ళీ అప్పటి నుంచి తెలుగు సినిమాలలో నటించలేదు.కాగా ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ కి తన సేవలు అందిస్తోంది.