మరొక ఎమ్మెల్యే టీడీపీ లోకి జగన్ కి చుక్కలు

ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరిపోయారు.

 Another Jumping Mla From Ycp-TeluguStop.com

వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాగా ఉన్న కర్నూలు నుంచి మొదలైన జంపింగ్ ల పర్వం… ఆ జిల్లాలో ఆ పార్టీని దాదాపుగా జీరో స్థాయికి చేర్చేలానే ఉంది.

ఇప్పటికే ఆ జిల్లా నుంచి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు జెండా మార్చేయగా, తాజాగా అదే జిల్లాలో మరో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు.

కర్నూలు శాసనసభ్యుడిగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి నేడు కర్నూలులోనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తన సొంత గూటికి చేరనున్నారు.నిన్ననే వైసీపీకి రాజీనామా చేసిన ఎస్వీ మోహన్ రెడ్డి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి కారణంగానే తాను పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు.

ఎస్వీతో పాటు ఆయన అనుచరవర్గం కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube