కర్నూలు జిల్లా డోన్ లో యువకులు వీరంగం సృష్టించారు.యువకులు పరస్పరం చేసుకున్న దాడులు వీధి రౌడీ మూకలను తలపించాయనడంతో అతిశయోక్తి లేదు.
కంబాలపాడు సర్కిల్ లో వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా కొట్టుకున్నారు.ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకుంటూ దాడులకు దిగారు.
డోన్ పట్టణంలో చెలరేగిన ఈ ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గతంలో టీచర్స్ కాలనీలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
ఈ యువకులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.