ఒకప్పుడు బర్త్డేకు కేకులు కట్ చేసి ఆ కేకును అంతా తినే వారు.మిగిలిన కేకును ఫ్రిజ్లో పెట్టి తెల్లారి తినే వారు.
కాని ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారింది.ఇప్పుడు కేకు తినడం కంటే పూసుకోవడంకు ఎక్కువ అవుతుంది.
బర్త్డే బాయ్కి కేకును ఎక్కడ పడితే అక్కడ పూయడం చేస్తున్నారు.మొహాన కేకును ఊపిరి ఆడకుండా పూయడం ఈమద్య కాలంలో చూస్తున్నాం.
అసలు కేకును కట్ చేయకుండానే మొహంను కేకుపై కుమ్మేస్తున్నారు.ఇలాంటి పరిస్థితి తాజాగా ఒక సింహంకు కూడా ఎదురైంది.
కుర్దిష్ పర్సన్ అనే వ్యక్తి ఒక సింహంను పెంచుకుంటున్నాడు.ఆ సింహంను తన ఇంట్లో మనిషి మాదిరిగా చూసుకుంటూ ఉన్నాడు.ఎదురింటి వారు పక్కింటి వారు భయపడి చస్తున్నా కూడా ఆ సింహాన్ని మాత్రం తాను ఒక పిల్లి మాదిరిగా కుక్క మాదిరిగా పెంచి పోషిస్తున్నాడు.తాజాగా ఆ సింహం పుట్టిన రోజు.
తన సింహం పుట్టిన రోజును చాలా ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశ్యంతో స్నేహితులను రమన్నాడు.స్నేహితులు అంతా కూడా వచ్చిన తర్వాత కేకును కట్ చేయించాలనుకున్నాడు.
అయితే ఈమద్య కాలంలో కేకును కట్ చేయకుండా మొహానికి కొడుతున్నారు.మనుషులు మాత్రమే మొహానికి కొట్టుకుంటారా, నా సింహానికి కూడా మొహానికి కొడాతానని కేకు మొత్తంను ఒక్కసారిగా సింహం మొహంపై కొట్టాడు.కేకు కాస్త సింహం కళ్లలోకి, ముక్కులోని వెళ్లి కొద్ది సమయం ఇబ్బంది పడింది.అయినా అక్కడున్న వారిని ఏమనలేదు.అది సాదు సింహం కనుక అది ఇబ్బంది పడ్డా ఇతరులను ఇబ్బంది పెట్టలేదు.కాని మనుషులు మాత్రం అత్యంత దారుణంగా ఒక మూగ జీవాన్ని హింసించారు.
ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మీరు ఇలా ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.