Kumari Aunty : శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వచ్చేసిన కుమారి ఆంటీ.. వైరల్ అవుతున్న ప్రోమో?

కుమారి ఆంటీ( Kumari Aunty ) పరిచయం అవసరం లేని పేరు నాన్న బుజ్జి కన్నా అంటూనే తన బిజినెస్ ను మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా అభివృద్ధి చేసుకున్నారు.

ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ అందరిని ప్రేమగా పలకరించి వారికి ఫుడ్ పెడుతూ మంచిగా ఈమె సంపాదిస్తున్నారు.

ఇలా ఈమె మాట్లాడే మాటలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ రిలీజ్ చేశారు.ఇక ఇటీవల ఒక డీజే సాంగ్ కూడా విడుదల చేశారు.

ఇలా రోజురోజుకు కుమారి ఆంటీ ఎంతో పాపులర్ అవుతున్నారు.ఈ క్రమంలోనే ఈమెను ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలోకి కూడా తీసుకువస్తున్నారు.

ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ ఉత్సవ్ ( Bigg Boss Ustav ) కార్యక్రమంలో కుమారి ఆంటీ పాల్గొని సందడి చేశారు.ఈ కార్యక్రమంలో సీజన్ సెవెన్ కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఈమె తన ఫుడ్ టెస్ట్ చూపించారు.

Advertisement

త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది అయితే ఈమె మరో కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

కుమారి ఆంటీ ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama company ) కార్యక్రమంలోకి కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈమె ఈ కార్యక్రమంలో కూడా అందరికీ ఫుడ్ పెడుతున్నట్టు చూపించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఏం కావాలి నాన్న అంటూ అందరినీ ప్రేమగా పలకరించడంతో వెంటనే హైపర్ ఆది ( Hyper Aadi ) ఇది అసలైన బిజినెస్ ట్రిక్ అంటూ ఆమెపై సెటైర్ వేశారు.

ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారడంతో పలువురు కుమారి ఆంటీ పాపులారిటీ పై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు