కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా స్పష్టం చేసారు.ప్రస్తుతం రాజకీయాలలో, ముఖ్యంగా అనిశ్చితికి మారుపేరైన కర్నాటక రాజకీయాలలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మూడు పూర్తి కాలం ఆ బాద్యతలు నిర్వహించలేకపోయిన ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్నాడు.
రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు కుమారస్వామి వ్యాఖ్యానించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, అనుకోకుండానే సీఎంను అయ్యానని ఆయన వ్యాఖ్యానించారు.
రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడని చెప్పారు.
ఎవరినో మెప్పించడం కోసం తాను రాజకీయాల్లో లేనని, తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 నెలలు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేశానని, ఈ పరిపాలనలో సంతృప్తికరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో తాను గమనిస్తున్నానని, రాజకీయాలు మంచి వాళ్ల కోసం కాదని, రాజకీయాలు కుల సమీకరణాలతో నడుస్తున్నాయని కుమారస్వామి వ్యాఖ్యానించారు.ఆ కులాల రొంపిలోకి తన కుటుంబాన్ని లాగొద్దన్నారు.
తాను ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటున్నా అని అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు కుమారస్వామి తెలియజేసారు.