బిగ్ బాస్ సీజన్ 4.ఇంకా రెండు రోజులు అంతే పూర్తవుతుంది.
దీంతో ఈ వారం అంత కూడా బిగ్ బాస్ సీజన్ 4లో వచ్చి ఎలిమినేట్ అయిన కంటస్టెంట్లు అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రి ఎంట్రీ ఇచ్చారు.అందరూ కూడా వాళ్ళకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ కలిసి హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.అలా ఎంటర్ అయ్యారో లేదో ఇలా కంటస్టెంట్ల అందరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు.
అంతగా ఎవరికి అబ్బా.అఖిల్ కి నా ? అని మీకు అనిపించచ్చు.అవును అఖిల్ నే అన్నాడు.బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లే సమయంలో అఖిల్ చాలా దారుణంగా అవమానించాడు.నేను ఆట ఆడుతున్న కాబట్టి ఇక్కడ ఉన్న.లేదు కాబట్టి మీరు అక్కడ ఉన్నారు అంటూ సెటైర్స్ వేశారు.
అలా వేసిన అఖిల్ ని ఒక ఆట ఆడించాడు.నిన్ను చూసి చాలా నేర్చుకున్న బాస్.
పులిహోర ఎంత బాగా కలపాలి అనేది తెలుసుకున్న అంటూ సెటైర్స్ వేశాడు అఖిల్.
కేవలం అఖిల్ ని మాత్రమే కాదు.
చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేసి ఎలిమినేట్ కి కారణం అయినా హరికను కూడా కుమార్ సాయి వదల్లేదు.ఎప్పుడైనా ఒకటైన పెద్ద కారణం చెప్పి ఎలిమినేట్ చేసావా హారిక అంటూ ప్రశ్నించాడు.
ఇంకా వేలు చుపిస్తునందుకు గొడవైన అంశంపై సోహెల్ గొడవ సంగతి తెలిసిందే.అందుకే ఆ గొడవపై కూడా ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడు కుమార్ సాయి.
ఇలా అందరిపై సెటైర్స్ వేసిన కూడా వారు ఫైనలిస్ట్ కాబట్టి స్పందించేకి లేకపోయింది.ఏది ఏమైనా కుమార్ సాయి తన కక్షను అంత తీర్చేసుకున్నాడు.
ఇక అప్పట్లో కుమార్ సాయ్ ఎలిమినేషన్ కూడా సరైనది కాదంటూ కొన్ని రోజుల పాటు బిగ్ బాస్ పై ట్రోల్స్ వేసిన సంగతి తెలిసిందే.