తెలుగు బిగ్బాస్ సీజన్ 4 నుండి మరో వికెట్ రాలి పోయింది.మొదటి వారం సూర్య కిరణ్, రెండవ వారం కరాటే కళ్యాణి, మూడవ వారం దేవి, నాల్గవ వారం స్వాతి దీక్షిత్, అయిదవ వారం సుజాత ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోగా నిన్నటితో ముగిసిన ఆరవ వారంలో కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు.
మొదటి వారం ముగిసిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కుమార్ హౌస్లో ప్రవేశించాడు.అతడు వెళ్లిన రోజే ఎలిమినేషన్ నామినేషన్ జరిగింది.
అప్పుడే అతడికి ఇంటి సభ్యులు మతి పోగొట్టారు.నువ్వు ఇప్పుడే వచ్చావు.
మేము అందరం కలిసి ఉన్నాం.కనుక నువ్వు ఎలిమినేట్కు నామినేట్ అవ్వు అన్నారు.
దాంతో అప్పటి నుండి అతడి ఒంటరి పోరాటం మొదలు అయ్యింది.కుమార్ సాయి ఆ తర్వాత నాలుగు సార్లు నామినేట్ అవుతూనే ఉన్నాడు.
మొత్తం నాలుగు సార్లు ఎలిమినేషన్కు నామినేట్ అయిన కుమార్ సాయి మూడు సార్లు సేవ్ అయినా నిన్నటి వారం లో మాత్రం సేవ్ అవ్వలేదు.అయిదు వారాల పాటు కుమార్ సాయి జర్నీ కొనసాగింది.
మొదటి వారంలో పెద్దగా ప్రేక్షకుల ఆధరణ దక్కించుకోలేక పోయిన కుమార్ సాయి ఆ తర్వాత తర్వాత మంచిగా ఆడుతూ పర్వాలేదు అనిపించుకున్నాడు.సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ పెరిగింది.
ఆయనతో ఎలిమినేషన్లో ఉన్న మోనాల్ కు తక్కువ ఓట్లు వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది.ఆమె ఇంట్లో ఉండాలని ఆమె ఉంటే కాస్త మసాలా ఉంటుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆమెను ఉంచారు.
దానికి తోడు ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన అయిదుగురులో నలుగురు అమ్మాయిలే ఉన్నారు.కనుక ఈసారి అబ్బాయిని ఎలిమినేట్ చేయడం వల్ల బ్యాలెన్స్ చేయాలని భావించారు.
అందుకే ఆమెను కాకుండా ఆయన్ను ఎలిమినేట్ చేశారు అంటూ టాక్ వినిపిస్తుంది.మొత్తానికి కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.