నాగార్జున హోస్ట్ ఇటీవల ప్రారంభమైన బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఏడో వారానికి చేరుకుంది.ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.
ఆరో వారంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి దుకాణం సద్దేశాడు.అయితే కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వడంపై ప్రేక్షకులు తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం చేశారు.
కుమార్ సాయికి ఎక్కువ ఓట్లు వచ్చినా కావాలనే ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన కుమార్ సాయి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలను, కంటెస్టెంట్ల స్వభావాలను బయటపెట్టాడు.వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడం నాకు పెద్ద మైనస్ అయ్యిందని చెప్పిన కుమార్ సాయి.
తాను వెళ్లేసరికి హౌస్లో కంటెస్టెంట్లు అందరూ ఫ్రెండ్స్తో సెట్ అయిపోయారు.తనను కలుపుకోవడం మానేశారని చెప్పుకొచ్చాడు.
అయితే తాను బిగ్ బాస్ హైస్లోనే కాదు.బయట కూడా బలవంతంగా స్నేహం చేయలేనని చెప్పిన కుమార్ సాయి.తన వంతు తాను ప్రయత్నించినా ఎవరూ తనతో కలవలేదని తేల్చేశాడు.ఇక బిగ్ బాస్ హౌస్లో అతి కష్టమైన పని ఏదైనా ఉందా అంటే.
అదే నామినేషన్ చేయడమే అని వివరించారు.అప్పటివరకూ స్నేహంగా ఉన్న వ్యక్తినే ఒక్కోసారి నామినేట్ చేయాల్సి వస్తుందని.
అది తనకు చాలా కష్టంగా అనిపించిందని కుమార్ సాయి తెలిపారు.
కానీ, కొందరు ఇంటి సభ్యులు మాత్రం నన్నే టార్గెట్ చేయడంతో.
వాళ్లకు నామినేషన్స్ ఈజీగానే ఉండేవని తెలిపారు.అలాగే తాను ఎలిమినేట్ అయినందుకు బాధ లేదు.
కానీ, మేము ఓట్లు వేశాము, నువ్ ఎలా ఎలిమినేట్ అయ్యావ్ సోదరా అని చాలా మంది అంటుంటే బాధగా ఉందని కుమార్ సాయి తెలిపారు.