టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4.ప్రస్తుతం ఏడో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే.మొదట్లో నీరసంగా సాగిన ఈ షో.రాను రాను బాగా ఫామ్లోకి వచ్చింది.గొడవలు, ఏడ్పులు, టాస్కులు, లవ్ ట్రాకులతో ప్రతి రోజు బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది.ఇక ఇప్పటి వరకు సూర్య కిరణ్, యాంకర్ దేవి నాగవల్లి, కరాటే కళ్యాణి, స్వాతి దీక్షిత్, సుజాత, గంగవ్వ ఎలిమినేట్ కాగా.
నిన్నటి ఎపిసోడ్లో కుమార్ సాయి బ్యాగ్ సద్దేశాడు.
వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కుమార్ సాయి ఐదు వారాలకే ఎలిమినేట్ అయినప్పటికీ.
చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు.వాస్తవానికి మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో కుమార్ సాయి ఎలిమినేట్ కావడం అందరినీ షాక్కు గురి చేసింది.
ఇదిలా ఉంటే.స్టేజ్ మీదకు వచ్చిన కుమార్ సాయికు నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చారు.
మీకు కథ చెప్తాను, ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగిన కుమార్ సాయికి.నాగ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాడు.
అనంతరం కుమార్ సాయి తనకు ఇచ్చిన కూరగాయలతో ఇంట్లోని వారిని పోల్చాడు.అయితే ఉన్నదున్నట్టుగా చెప్పిన కుమార్ మాటలను కొందరు కంటెస్టెంట్లు తీసుకోలేకపోయారు.ఇక చివర్లో కుమార్ సాయి మొదటి నుంచి తాను వ్యతిరేకిస్తున్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ పై బిగ్ బాంబ్ వేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు.ఇంతకీ ఆ బాంబ్ ఏంటంటే.
హౌజ్లో బాత్రూమ్లు వారం రోజుల పాటు మాస్టర్నే శుభ్రం చేయాల్సి ఉంటుంది. కాగా, శనివారం ఎపిసోడ్లో హాఫ్ షేవ్ చేసుకుంటే వచ్చేవారం నామినేషన్స్ నుంచి సేవ్ కావొచ్చని నాగార్జున డీల్ ఇవ్వడంతో.
అమ్మ రాజశేఖర్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇంటి సభ్యులు వద్దని ఎంత చెబుతున్నా.వినకుండా మాస్టర్ అరగుండు, అరగడ్డం చేయించుకుని మరీ ఏడో వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు.