జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు మంత్రి కేటీఆర్.అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను తీసుకున్న కేటీఆర్.
ఎన్నికలలో పార్టీని విజయపథంలో ముందుకు నడిపించడం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అందరికీ తెలిసిందే.
వాటిలో ఒకటి గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఇరవై వేల తాగునీరు ఉచితంగా అందించటం.
కాగా జరిగిన గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో విజయం సాధించడంతో తాజాగా ఈ హామీని నెరవేర్చడానికి మంత్రి కేటీఆర్ సన్నద్ధమయ్యారు.ఇటీవల ఉచిత త్రాగునీరు కార్యక్రమానికి హైదరాబాదులో మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.బస్తీ లతో పాటు అపార్ట్మెంట్, ఫ్లాట్ లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అయింది.
ఇదిలా ఉండగా ప్రతి కుటుంబానికి నీటి వాడకం 20 వేల లీటర్ల దాటితే అదనంగా వాడుకున్న నీటికి ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలను వసూలు చేయడానికి టిఆర్ఎస్ సర్కార్ రెడీ అయింది.ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఆధార్ కార్డు అనుసంధానం చేసి మార్చి నెలాఖరు లోపు దరఖాస్తు చేసే టైం విధించింది.
ఆధార్ అనుసంధానం. దరఖాస్తు అంతా ఓకే అయితే మీటర్ ఏర్పాటయితే ఉచిత త్రాగునీరు అందించనుంది టిఆర్ఎస్ ప్రభుత్వం.