ఈ కరోనా లాక్డౌన్ లేకుంటే నేడు టీఆర్ఎస్ శ్రేణులకు అత్యంత పెద్ద పండుగా.కేసీఆర్ పార్టీని ప్రారంభించి నేటికి 20 ఏళ్లు.
ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించే వారు.కాని ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలు కాదు కదా కనీసం చిన్న పాట మీటింగ్ కూడా నిర్వహించుకునే పరిస్థితులు లేవు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించుకోనవసరం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ పార్టీ జెండా ఎగురవేయనున్నారు.
జిల్లాల్లో మండలాల్లో సామాజిక దూరం పాటిస్తూ కార్యకర్తలు ఈ సందర్బంగా ఆవిర్భావ దినోత్సవంను జరుపుకోవాలని సూచించారు. ఈ ఇరువై ఏళ్లలో పార్టీ సాధించిన విజయాలను మరియు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలను గురించి మీడియా ముందు అధ్యక్షుడు కేసీఆర్ వెళ్లడి చేయబోతున్నారు.
ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ పార్టీగా ఆవిర్భవించి రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని చేపట్టింది.తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు.