టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంపై వైఎస్ఆర్టిపి అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటున్న మంత్రి కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.బండారం బయటపడుతుందని టిఎస్పిఎస్సి తో సంబంధాలు లేవని చెబుతున్నారని ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ తో లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు పేపర్ లీక్ అంశం బయటకు రాగానే టీఎస్పీఎస్సీ తో సంబంధం లేదంటున్నారని విమర్శించారు.ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ కేటీఆర్ తప్పించుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
దమ్ముంటే పేపర్ లీక్ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.