తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోడంటూ ప్రతిపక్షాలు తమ వ్యతిరేకతను అవకాశం వచ్చినప్పుడల్లా తెలియజేస్తున్నాయి.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుందని, కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడంటూ కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి.
అయితే ప్రతిపక్షాలకు చురకలంటించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.కేసీఆర్ జనవరి 30న ఎలాంటి మీటింగ్ పెట్టడం లేదని ఆయన తేల్చారు.మతం పేరుతో అధికారాన్ని చేపట్టాలని భాజపా చూస్తోందని ఆయన విమర్శించారు.అటు కాంగ్రెస్ పార్టీలో సొంత భార్యను గెలిపించలేకపోయిన ఉత్తమ్ కుమార్కు కేసీఆర్పై విమర్శలు చేసే అర్హత లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఇక మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
యావత్ దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని, యువత మొత్తం కేటీఆర్ వైపు చూస్తుందని ఆయన అన్నారు.కేసీఆర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే పూర్తి అర్హత కేవలం కేటీఆర్కు ఉందని ఆయన వెల్లడించారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి.