నగరంలో చాలా అభివృద్ది జరిగిందని జబ్బలు చరుచుకుంటున్న అధికారులు ఒక్కసారి ఇక్కడి రోడ్ల దుస్దితి మనస్సు పెట్టి చూస్తే తెలుస్తుంది.ఇక డ్రైనేజీల విషయం అయితే చెప్పవలసిన అవసరం లేదు.
మూసీ నది కళ్లముందే ప్రవహిస్తుందా అనిపిస్తుంది.మరి మర్మతులు చేస్తున్నాం అంటారు కానీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పనులు సాగుతున్నాయి.
ఈ క్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల మీద సీరియస్ అయ్యారు.ఇక నగర పారిశుద్యం విషయంలో అసహనానికి గురైన ప్రజలు రోడ్ల మీద రోజుల తరబడి చెత్త పెరుకు పోయి వాసన వస్తుండటంతో, ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఇటీవల ట్విట్టర్ ద్వారా అనేక సార్లు ప్రజలు ఫిర్యాదులు చేశారు.
ఇది గమనించిన కేటీయార్ టాయిలెట్స్ తీరు పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.టాయిలెట్స్ మెయింటైన్ చేయక పోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.