మంత్రి కేటీఆర్ సమస్యల విషయంలో చాలా వెరైటీగా స్పందిస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య విషయంలో తాను స్పందించడం మాత్రమేకాక ఇతరులను కూడా చైతన్య పరుస్తూ ఉంటారు కేటీఆర్.
ఈ క్రమంలోనే చాలా మందికి అనేక రీతులుగా కేటీఆర్ సహాయం కూడా చేయడం జరిగింది.ఇటీవల జరిగిన గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం ఇందుకు ఉదాహరణ.
ఇదిలా ఉంటే మరోసారి కేటీఆర్ తన మంచి మనసు చాటుకున్నారు.వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని మేకల అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు సాధించడం జరిగింది.
పేదరికం కావడంతోపాటు కుటుంబం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన చదువు విషయంలో కేటీఆర్ ని విద్యార్థిని అంజలి హెల్ప్ అడగటం జరిగింది.దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ ఆమె కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని గత రెండు సంవత్సరాల నుండి ఆమెకు ఫీజు కడుతూ వస్తున్నారు.తాజాగా ప్రగతిభవన్లో ఈ ఏడాదికి వచ్చే ఏడాదికి కలిపి కూడా ఫీజు అంజలికి కేటీఆర్ అందించడం జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ అంజలి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ వ్యక్తిగత హోదాలో కేటీఆర్ ఈ సాయం అందించడంతో వార్త సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజా వార్తలు