యువ నేత తెలంగాణా ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే.టి.
ఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.ట్విట్టర్ లో ఆస్క్ కే.టి.ఆర్ ప్రోగ్రాం ద్వారా తెలంగాణా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు.ఈ క్రమంలో ఆదివారం వ్యాక్సినేషన్ మీద చర్చ జరిపారు కే.టి.ఆర్.ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం అవడానికి కారణం కేంద్రం ప్రభుత్వమే అని చెప్పారు కే.టి.ఆర్.రాష్ట్రాలే టీకాలు కొన్నుకోవాలనడం కూడా తప్పుడు నిర్ణయమని అన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ పై కే.టి.ఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉన్న మన దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమని అన్నారు.
లెట్స్ టాక్ వ్యాక్సినేషన్ అంశంలో భాగంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు కే.టి.ఆర్.ప్రపంచదేశాలు లాస్ట్ ఇయర్ మే నుండే వ్యాక్సిన్ లు ఆర్డర్లు పెట్టాయని ఇండియాలో మాత్రం జనవరి వరకు వ్యాక్సిన్లు మొదలు పెట్టలేదని కేంద్ర, రాష్ట్రాలకు సెపరేట్ రేటు పెట్టారని.వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుండి నేరుగా రాష్ట్రాలే టీకాల్ కొనుక్కోవడం కూడా వ్యాక్సిన్ ప్రక్రియ లేట్ అయ్యేల చేశాయని అన్నారు.