ఇటీవల టిఆర్ఎస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు కేటీఆర్ సీఎం అంటూ ఊహించని కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు గత కొంత కాలం నుండి కేటీఆర్ సీఎం అంటూ మీడియా ముందు తెగ ఊదర గొడుతున్నారు.
ఇదిలా ఉంటే వస్తున్న వార్తలను అటుపక్క కెసిఆర్ గానీ ఇటుపక్క కేటీఆర్ గాని ఎవరూ పెద్దగా ఖండించడం లేదు.ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి సాక్షిగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కేటీఆర్ ను ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు.
తాజాగా ఆయన తిరుమలలో శ్రీ వెంకన్నని దర్శించుకోవటం అనంతరం మీడియాతో మాట్లాడుతూ భగవంతుని కృపతో సరైన సమయంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు.దీంతో బొంతు రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే మరో పక్క పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో, మరోపక్క పాలనా పరంగా కూడా అధికారులతో వరుసగా సమీక్ష సమావేశాలు కేటీఆర్ నిర్వహించటం బట్టి చూస్తే అతి త్వరలోనే కేటీఆర్ సీఎం పీఠంపై కూర్చోవడం గ్యారెంటీ అనే టాక్ తెలంగాణ రాజకీయాలలో బలంగా వినబడుతోంది.