టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ప్రత్యర్థులపై రెచ్చి పోతున్నారు.కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఇటువంటి తరుణంలో రెండు జాతీయ పార్టీలకు కేటీఆర్ సరికొత్త ఛాలెంజ్ విసిరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో మాత్రమే ఉన్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధిని.
అమలవుతున్న కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాలలో లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో.చూపించ గలరా అంటూ ఛాలెంజ్ విసిరారు.
తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.కానీ పక్కనే ఉన్న కర్ణాటకలో అపర భద్రత కి… జాతీయ హోదా ఇస్తారు.
ఎందుకు తెలంగాణ పట్ల ఇంత వివక్ష అంటూ కేటీఆర్ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.