అంతర్రాష్ట్ర మరి జాతీయ ప్రయాణాలకు రహదారులు కీలకం, తెలంగాణ లో అత్యంత కీలకమైన హైదరాబాద్ విజయవాడ రహదారి సమస్యలు తొలగించి అభివృద్ధి చేసేందుకు ₹500 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కోరాడు.తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రోత్సహించాలి అని కోరారు.
హైదరాబాద్ కు అత్యంత కీలకమైన ఈ రహదారి మహానగరం లో 25kmలు విస్తరించి ఉందని, సర్వీస్ రోడ్లు, హై లెవెల్ జంక్షన్ లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.లేన్లు సామర్ధ్యాన్ని పెంచాల్సిన అవసరం దృష్టి లో పెట్టుకొని రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ₹500 కోట్లతో డీటైల్డ్ రిపోర్ట్ ను తయారు చేసిందని వెల్లడించారు.
హైదరాబాద్ లో మెట్రో తో పాటు ఎస్.ఆర్.డి.పి ప్రాజెక్ట్ లో భాగంగా ఫ్లై ఓవర్లు, రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి పూర్తి చేసి లింక్ రోడ్లను నిర్మించమని, రాష్ట్ర ప్రభుత్వ పనులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.