ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాడు.ఈ సమయంలోనే సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.
కొందరు జగన్కు మద్దతుగా మాట్లాడుతూ ఉంటే మరి కొందరు మాత్రం మౌనం వహించారు.అయితే ఈ సమయంలోనే జగన్ సీఎం అవ్వడంతో బాలకృష్ణ సినిమా క్యాన్సిల్ అయ్యింది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఆ విషయమై నిర్మాత నుండి అనధికారిక సమాచారం వచ్చింది.
నిర్మాత సి కళ్యాణ్ తాజాగా సన్నిహితుల వద్ద బాలకృష్ణ, రవికుమార్ మూవీ గురించి మాట్లాడుతూ సినిమాలో రాజా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాత్రలను పోలినట్లుగా విలన్ పాత్రలను అనుకున్నాం.అయితే జగన్ సీఎం అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా తీస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అందుకే సినిమాను కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అని స్క్రిప్ట్లో విలన్ పాత్రను పూర్తిగా మార్చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఆయన మాట ప్రకారం చూస్తుంటే జులై లేదా ఆగస్టులో సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.
ఎన్టీఆర్ మూవీ తర్వాత చాలా డిస్సప్పాయింట్ అయిన బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు.అందుకే ఈ చిత్రం విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అందులో భాగంగానే ప్రస్తుతం స్క్రిప్ట్లో మార్పులు చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడని తెలుస్తోంది.ఎప్పుడు ప్రారంభం అయినా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.