జగన్‌ సీఎం అవ్వడంతో కథలో మార్పులు చేస్తున్న దర్శకుడు

ఏపీ సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేశాడు.ఈ సమయంలోనే సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.

 Ks Ravi Kumar Wants To Change Storyline For Balayya About Cm Ys Jagan-TeluguStop.com

కొందరు జగన్‌కు మద్దతుగా మాట్లాడుతూ ఉంటే మరి కొందరు మాత్రం మౌనం వహించారు.అయితే ఈ సమయంలోనే జగన్‌ సీఎం అవ్వడంతో బాలకృష్ణ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఆ విషయమై నిర్మాత నుండి అనధికారిక సమాచారం వచ్చింది.

జగన్‌ సీఎం అవ్వడంతో కథలో మార్�

నిర్మాత సి కళ్యాణ్‌ తాజాగా సన్నిహితుల వద్ద బాలకృష్ణ, రవికుమార్‌ మూవీ గురించి మాట్లాడుతూ సినిమాలో రాజా రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి పాత్రలను పోలినట్లుగా విలన్‌ పాత్రలను అనుకున్నాం.అయితే జగన్‌ సీఎం అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా తీస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అందుకే సినిమాను కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అని స్క్రిప్ట్‌లో విలన్‌ పాత్రను పూర్తిగా మార్చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఆయన మాట ప్రకారం చూస్తుంటే జులై లేదా ఆగస్టులో సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

జగన్‌ సీఎం అవ్వడంతో కథలో మార్�

ఎన్టీఆర్‌ మూవీ తర్వాత చాలా డిస్సప్పాయింట్‌ అయిన బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు.అందుకే ఈ చిత్రం విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అందులో భాగంగానే ప్రస్తుతం స్క్రిప్ట్‌లో మార్పులు చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.ఎప్పుడు ప్రారంభం అయినా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube