టాలీవుడ్ దర్శకుడు తేజ గతకొంత కాలంగా ‘అలిమేలు మంగ’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.పూర్తి లేడీ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
అయితే ఈ సినిమాలో లీడ్ హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.కాగా ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టింది.
కానీ ఇటీవల ఆమె వివాహం చేసుకోవడంతో, ఇప్పుడు ఈ పాత్రలో ఎవరు నటిస్తారా అనే డైలమా నెలకొంది.
అయితే తేజ ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ బ్యూటీ అనుష్క శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నాడట.
కానీ ఈ సినిమా మొదలయ్యే నాటికి అమ్మడు పెద్దమొత్తం డేట్స్ ఇచ్చేందుకు రెడీ ఉండాలనే కండీషన్ పెట్టాడట తేజ.దీంతో అనుష్క ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.ఇక తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ నటించనున్నట్లు తెలుస్తోంది.ఉప్పెన చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి, ఇటీవల తన రెండో ప్రాజెక్టుగా ‘శ్యామ్ సింఘ రాయ్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ బ్యూటీ అయితే త్వరగా తన సినిమాలు పూర్తి చేసి తన చిత్రం కోసం రెడీగా ఉండే అవకాశం ఉందని తేజ భావిస్తున్నాడు.
అందుకే ‘అలిమేలు మంగ’ చిత్రంలో హీరోయిన్గా కృతి శెట్టిని తీసుకోవాలని తేజ ఆలోచిస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
అందంతో పాటు అభినయంతోనూ మెప్పించే సత్తా ఈ బ్యూటీకి ఉందని తేజ ఫిక్స్ అయ్యాడని, అందుకే ఈ బ్యూటీతో టైటిల్ రోల్ చేయించాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం తేజ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు అభిమానులు.
కాగా తేజ తెరకెక్కించిన లాస్ట్ మూవీ సీత బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.