టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా వన్ నేనొక్కడినే అనే సినిమాలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సినిమాలు చేస్తున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వాఖ్యలు చేసింది.
నిజానికి బీటౌన్ లో స్టార్ కిడ్స్ హవా ఎక్కువగా ఉంటుంది.స్టార్ లు సెటిల్ అయిన వారి కుటుంబాల నుంచి హీరోయిన్స్ గా వచ్చిన వాళ్ళు హవా ప్రస్తుతం నడుస్తుంది.
దీనిపై గతంలో కంగనా లాంటి హీరోయిన్స్ బాహాటంగానే విమర్శలు చేశారు.స్టార్ కిడ్స్ అనే ఒక్క ట్యాగ్ తో చాలా మంది సినిమా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారని, టాలెంట్ కంటే వాళ్ళకే ప్రాధాన్యత అని వాఖ్యలు చేసింది.
ఇప్పుడు కృతి సనన్ కూడా ఇంచుమించు అలాంటి వాఖ్యలే చేసింది.ఇండస్ట్రీలో ఎవరూ లేకుండా వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పింది.
అయితే స్టార్లుగా వెలుగొందిన వారి పిల్లలకి ఇక్కడ ఏ భయమూ అక్కర్లేదు.తొలి సినిమా విడుదల కాకుండానే మరో సినిమాలో ఛాన్స్ వచ్చేస్తుంది.
స్టార్ కిడ్స్ కి ఇది గొప్ప అవకాశం.మాలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి కెరీర్ పట్ల ఎప్పుడు భయంగా ఉంది.
కెరియర్ ఆరంభంలో భాగా నిరూపించుకోవాలని, దర్శక, నిర్మాతలని మెప్పించాలి.అయిన కూడా మొదటి సినిమా ఫ్లాప్ అయితే రెండో సినిమా అవకాశం కోసం తిప్పలు పడాల్సిందే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆమె అన్నట్లుగానే బాలీవుడ్ లో అలియా భట్ కి వచ్చినన్ని అవకాశాలు, ఫేం ఎవరికీ రావడం లేదని చెప్పాలి.
.