యూపీలోని హత్రస్ లో దళిత యువతిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే.యువతిని గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనపై దేశం మొత్తం అట్టుడికిపోతోంది.యూపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
అయితే ఇంతటి దారుణమైన ఘటన జరిగితే కొంత మంది ప్రజాప్రతినిధులు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు.నాయక మహిళలని కించ పరిచే విధంగా వాఖ్యలు చేయడంపై చాలా మంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఓ బీజేపీ ఎమ్మెల్యే హత్రస్ ఘటన పై స్పందిస్తూ మంచి విలువలు, సంస్కారంతో సమాజంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చేయవచ్చు.తల్లిదండ్రులు తమ కుమార్తెలు సంస్కారం నేర్పించాలి.
ప్రభుత్వాలు కేవలం రక్షణ మాత్రమే కల్పిస్తాయి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వాఖ్యలపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలకి మాత్రమే సంస్కారం నేర్పించాలా, పురుషులకి అవసరం లేదా అంటూ ప్రశ్నించారు.
తాజాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ కృతిసనన్ కూడా ఫైర్ అయ్యింది.
అసలు ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడో అతడికైనా అర్ధం అవుతుందా అని వ్యాఖ్యానించింది.ఆయన ఏం చెప్పారో ఎవరికైనా అర్థం అయ్యిందా అంటూ ప్రశ్నించింది.ముందు అలాంటి మనస్తత్వాలు మార్చుకోవాలంటూ మండి పడింది.ఆయన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని, అసలు తల్లిదండ్రులు అబ్బాయిలకే సంస్కారం నేర్పించాలని పేర్కొంది.
వివాదాస్పద విషయాలపై పెద్దగా స్పందించని కృతి సనన్ కూడా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే వాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాలీవుడ్ సెలబ్రిటీలకి బీజేపీ పార్టీ, మోడీపై కోపం ఉందా అని చర్చించుకుంటున్నారు.