మహేష్ బాబు తో 1 నేనొక్కడినే సినిమాలో హొయలు ఒలికించిన కృతీ సనన్ తరవాత బాలీవుడ్ కి చేరుకొని ఏకంగా షారూఖ్ ఖాన్ సరసన నటించేసింది.ఆమె కి ఆ సినిమా తో బ్రేక్ ఒచ్చిందా? తరవాత ఇంకా ఎక్కువగా బాలీవుడ్ లో రాణించగలదా లాంటి విషయాలు తేలాల్సి ఉంది.ఇలోగా ఆమె చిట్టి చెల్లలు ని అరంగేట్రం చేయిస్తోంది ఈ బ్యూటీ.ఆమె పేరు నూపూర్ సనోన్ అట.రీసెంట్ గా షారూక్ మూవీ దిల్ వాలే రిలీజ్ అయ్యాక బాగా నోటీస్ అయింది ఈ భామ.అయితే యాక్టర్ గా కాదు.ఈమె బేసిక్ గా క్లాసికల్ సింగర్.జనమ్ జనమ్ సాంగ్ తో అందరూ ఈమె ట్యాలెంట్ ని గుర్తించారు.ఈ పాటకు మేకింగ్ సాంగ్ కూడా రిలీజ్ చేయడంతో.
నూపుర్ ను అందరూ గుర్తించారు కూడా.
ఒక్కసారిగా హీరోయిన్ సిస్టర్ కి క్రేజ్ పెరిగిపోయింది.పైగా ఇప్పటికే ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 10 లక్షలకు పైగా క్లిక్స్ వచ్చాయంటే.
ఈ పాట ఎంతగా ఫేమస్ అయిందో అర్ధమవుతుంది.అన్నిటికీ మించి ఈమె సున్నితమైన వాయిస్ చాలామందికి నచ్చేసింది కూడా.
ప్రస్తుతం నూపుర్ సనోన్ హీరోయిన్ కానుందనే వార్తలో బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి.మరి ఈమెను సంప్రదించినది ఎవరో బయటకు రాలేదు కానీ.
హీరోయిన్ ఎంట్రీ మాత్రం ఫిక్స్ అంటున్నారు.ఆ మధ్య శామితాబ్ సినిమాతో శృతీ హాసన్ చెల్లి అరంగేట్రం తరవాత ఇప్పుడు కృతీ చెల్లి అరంగేట్రం అన్నమాట.