తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి వన్ – నేనొక్కడనే అనే చిత్రంలో మహేష్ బాబు సరసన నటించి ప్రేక్షకులను బాగా మెప్పించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ రోజు అమ్మడు పుట్టిన రోజు కావడంతో నుపుర్ సనన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
ఇందులో భాగంగా తామిద్దరూ చిన్నప్పుడు కలిసి తీయించుకున్న ఫోటోని తన అభిమానులతో పంచుకుంది.తన అక్క కృతి సనన్ అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే అమితమైన గౌరవం అని కూడా తెలిపింది.
ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన అతి తక్కువ కాలంలోనే లక్షా 25 వేల పైచిలుకు మంది లైక్ చేశారు.మరో పది వేల పైచిలుకు మంది కామెంట్ల ద్వారా కృతి సనన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే కృతి సనన్ దివంగత బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటించినటువంటి అంగ్రేజీ మీడియం అనే చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ పాత్ర లో నటించింది. కాగా ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు లక్ష్మణ్ ఉత్తేకర్ దర్శకత్వం వహిస్తున్న “మీమి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.