యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా మారడంతో ఆయన చేయబోయే సినిమాలకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా, ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఆయన ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.
ఇప్పటికే ‘రాధేశ్యామ్’ అనే పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్న ప్రభాస్, తన నెక్ట్స్ చిత్రాలను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.
ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్, అది మొదలుపెట్టకముందే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని చేసేందుకు రెడీ అయ్యాడు.
‘ఆదిపురుష్’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రాన్ని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశంపై ఇప్పటికే పలువురు పేర్లు వినిపించాయి.
అయితే ఈ సినిమాలో వారెవ్వరూ నటించడం లేదని, ఈ సినిమాలో సీత పాత్రలో నటించేది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
టాలీవుడ్లో మహేష్ బాబు సరసన ‘1-నేనొక్కడినే’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ, ఆ తరువాత బాలీవుడ్లో వరుసబెట్టి సక్సెస్ చిత్రాల్లో నటించి అక్కడే సెటిల్ అయ్యింది.
కాగా ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ అయితే సీత పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని దర్శకుడు ఓం రావుత్ భావించాడట.అందుకే ఈ సినిమాలో ఆమెను హీరోయిన్గా ఫైనల్ కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మరి మిగతా వారిని కాదని కృతినే దర్శకుడు ఎందుకు ఎంచుకున్నాడో తెలియాలంటే ఈ సినిమాలో ఆమె పర్ఫార్మె్న్స్ చూడాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.ఇక ఈ ప్రెస్టీజియస్ మూవీని అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.