బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిప్పుతోంది.తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తీగ లాగితే డొంకంతా కదులుతోంది.సుశాంత్ ఆత్మహత్య కేసు ఎంతో మంది అరెస్ట్ లకు కారణమవుతోంది.
సుశాంత్ ది ఆత్మహత్యా…? హత్యా…? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.ఏ కేసులోనైనా విచారణ జరిపే కొద్దీ సమస్య పరిష్కారం అవుతుంది.
అయితే ఈ కేసులో మాత్రం భిన్నంగా విచారణ జరిపే కొద్దీ వెలుగులోకి వస్తున్న విషయాలు సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి.సుశాంత్ మృతి తరువాత డ్రగ్స్ దందా వెలుగులోకి రాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ డ్రగ్స్ స్కామ్ లో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ పేరు కూడా వెలుగులోకి రాగా ఆమె మాత్రం తనకే పాపం తెలీదని… తాను కనీసం పొగ కూడా తాగనని తెలిపింది.
అయితే తాజాగా సుశాంత్ మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.
సుశాంత్ మృతి తరువాత సుశాంత్ లవ్ ఎఫైర్లకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.సుశాంత్, కృతిసనన్ జంటగా రాబ్తా అనే సినిమాలో కలిసి నటించారు.
ఆ సినిమాలో వీరిద్దరూ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చినా వాళ్లు మాత్రం ఆ విషయాన్ని అంగీకరించలేదు.అయితే తాజాగా నటి లీజా మాలిక్ కృతి, సుశాంత్ మధ్య లవ్ ఉందని… వాళ్లు డేటింగ్ చేశారని చెప్పుకొచ్చింది.
సుశాంత్ మృతి తరువాత కృతి తన గుండెలో ఒక భాగం వెళ్లిపోయిందంటూ చేసిన కామెంట్ కూడా కొత్త చర్చకు దారి తీస్తోంది.కరోనా, లాక్ డౌన్ ఉన్నప్పటికీ సుశాంత్ అంత్యక్రియలకు కృతి హాజరైంది.
సీబీఐ అధికారులు ఈ దిశగా దర్యాప్తు జరిపితే మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.