యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అందాధున్ రీమేక్ గా తెరకెక్కుతున్న మ్యాస్ట్రో మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది.ఈ సినిమాని నితిన్ హోం బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి నితిన్ ఒకే చెప్పాడని తెలుస్తుంది.ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన సినిమాతో క్రేజీ బ్యూటీగా మారిన కృతి శెట్టిని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే ఈ అమ్మడు ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, ఇంద్రగంటి, సుదీర్ బాబు సినిమాతో పాటు రామ్ లింగుస్వామి కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఖరారైంది.
ఇక ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ కి జోడీగా అవకాశం పట్టేసిందని తెలుస్తుంది.మొత్తానికి ఒక్క సినిమాతో ఏకంగా నలుగు ప్రాజెక్ట్ లని ఖరారు చేసుకోవడంతో పాటు నాగ శౌర్య, శర్వానంద్, నాగ చైతన్య నెక్స్ట్ సినిమాల కోసం కూడా కృతి శెట్టిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే తమిళ్ లో ధనుష్ కి జోడీగా ఒక సినిమాకి ఒకే చెప్పగా శివ కార్తికేయన్ జోడీగా మరో సినిమా కోసం కృతిని ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇలా తెలుగు, తమిళ్ బాషలలో వరుస ప్రాజెక్ట్ లతో కృతి శెట్టి ఫుల్ బిజీ అయిపోయి స్టార్ హీరోయిన్ గా మారబోతుందని తెలుస్తుంది.
మరి ఇప్పటిమే నితిన్ రష్మిక కాంబోకి భీష్మ సినిమాతో ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.అలాగే నితిన్, కృతి శెట్టి జోడీ కూడా తెరపై అడిరిపోతుందని మాట్లాడుకుంటున్నారు.