టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా మారింది.బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారింది.
తొలిసారి నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది కృతి.తన అందంతో, నటనతో కుర్రాళ్ళ మనసులను దోచుకుంది.17 ఏళ్లకే హీరోయిన్ గా నిలిచిన కృతి శెట్టి మొత్తానికి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడిపోయింది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఫోటోలను బాగా పంచుకుంటుంది.నిజానికి ఈ బ్యూటీ బుల్లితెరకు బాలనటిగా పరిచయం అయింది.ఎక్కువగా వాణిజ్యపరమైన ప్రకటనలలో నటించింది.
దీంతో ఈ అమ్మడి క్రేజ్ హీరోయిన్ వరకు చేరుకుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది కృతి శెట్టి.
డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అంతేకాకుండా నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్‘ సినిమాలో కూడా బిజీగా ఉంది.
ఇవే కాకుండా సుధీర్ బాబు నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నటిస్తున్న రామ్ సినిమాలో రెమ్యూనరేషన్ కూడా పెంచిందట.ఈ సినిమాకు ఏకంగా రూ.75 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట కృతి.అంతేకాకుండా నాగచైతన్య సరసన నటిస్తున్న బంగార్రాజు సినిమాలో కూడా ఇంతే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.మొత్తానికి తన రేంజ్ ఏంటో పారితోషకం లోనే చూపిస్తుంది కృతి.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లకు పోటీకి దిగుతున్నట్లు కనిపిస్తుంది.అంతేకాకుండా గ్లామర్ పాత్రలలో కూడా అవకాశాలు వస్తే నటించనున్నట్లుగా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నట్లు తెలిసింది.ఇందులో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నాడట.
కానీ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేవు.