ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ కృతి శెట్టి.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఉప్పెన రిలీజ్ కాకుండానే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో పాటు సుదీర్ బాబుకి జోడీగా రొమాంటిక్ లవ్ స్టొరీ చేయడానికి ఒకే చెప్పేసింది.ఉప్పెన రిలీజ్ తర్వాత ఇస్మార్ట్ హీరో రామ్ కి జోడీగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో ఆఫర్ కొట్టేసింది.
అలాగే స్టార్ హీరోలు కూడా కృతి శెట్టిని హీరోయిన్ గా కోరుకుంటున్నారు.అలాగే కోలీవుడ్ లోకి ధనుష్ కి జోడీగా ఒక సినిమాలో కృతి కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తుంది.
ఇలాఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీని తాజాగా సుకుమార్ బ్యానర్ లో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జోడీగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది.
కథ ప్రకారం హీరో టీనేజ్ లవ్ స్టొరీలో క్యామియో తరహాలో కనిపించే ఈ పాత్ర కోసం అమ్మడుని సుకుమార్ టీమ్ సంప్రదించడం జరిగిందని టాక్.అయితే వరుస అవకాశాలతో బిజీగా ఉంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగే ఇలాంటి సమయంలో అతిథి పాత్రలు చేస్తే కెరియర్ కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని కృతి శెట్టి భావించినట్లు బోగట్టా.
ఈ నేపధ్యంలో ఆ ఆఫర్ ని కృతి శెట్టి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది.అసలు ఇప్పట్లో గెస్ట్ అపీరియన్స్ పాత్రలు చేసే ఉద్దేశ్యం తనకి లేదని కూడా ఆమె చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే ఆమె నిర్ణయాన్ని కొందరు సమర్ధిస్తూ ఉంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్ జాతి రత్నాలు మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించింది కదా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.